లక్నో: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ నివాళులు అర్పించారు. వృద్ధాప్య సమస్యలతో ములాయం సింగ్ యాదవ్ ఇవాళ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రి నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఇటావా జిల్లా సైఫై గ్రామానికి తరలించారు. కాగా.. యూపీ సీఎం యోగి సోమవారం సైఫైకి చేరుకొని ములాయం భౌతిక కాయంపై పూలమాల ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం ఆయన కుటుంబ సభ్యలను పరామర్శించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడారు. భారత రాజకీయాల్లో ములాయం లేని లోటు పూడ్చలేనిదన్నారు. ములాయం వారసత్వాన్ని ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్ కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.